వీళ్ళు కలసి మెలసి ఎంత సమైక్యంగా ఉంటారో.. ఎలా కలిసి మెలసి సమస్యలను పరిష్కరించుకుంటారో.. రేపటి వరంగల్ ఉప ఎన్నికలోనే తెలిసిపోతుంది. అప్పటి దాకా వెయిట్ చేయండి పచ్చ గులాబి తమ్ముళ్ళు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుతమైన నగరం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగానికి సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది.
కేసీఆర్.. చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. దసరా రోజున అమరావతి శంకుస్థాపన జరగడం ఆనందదాయకమన్నారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుతమైన నగరం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగానికి సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది.
కేసీఆర్.. చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. దసరా రోజున అమరావతి శంకుస్థాపన జరగడం ఆనందదాయకమన్నారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.