తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో పరిధిలో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల నియామకాలు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిబంధనలకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు విద్యుత్తు పంపిణీ సంస్థలు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ చల్లా నర్సింహారెడ్డితో పాటు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్‌ లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ ఉద్యోగాల భర్తీకి చెందిన నిబంధనలకు సవరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఆ నిబంధనలకు అనుగుణంగా జారీచేసిన ఉద్యోగ ప్రకటన చెల్లుబాటు కాదన్నారు. ఉద్యోగాల భర్తీ నిబంధనలకు విద్యుత్తు సంస్థలు సవరణ చేసి తెలంగాణ ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించాయన్నారు. ఈ రెండు జోన్లలో ఏదో ఒక జోన్లో జన్మించినా, ఆరేళ్లకు మించి విద్యను అభ్యసించినా స్థానికులుగా గుర్తిస్తారని వివరించారు. ఉద్యోగాల భర్తీలో 70 శాతం స్థానికులకు, 30

Popular Posts

 
Top