జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే... భోజనానంతరం కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అలా చేస్తే అరుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడీ ఉండదు.
• ఇంతకీ ఆ పనులేంటంటే...!
• ఇంతకీ ఆ పనులేంటంటే...!
- కొందరు రాత్రిపూట భోంచేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి రెండు సార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల శరీరంలో కదలికలు అతిగా ఉంటాయి. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుంది. అరుగుదల మందగిస్తుంది. షవర్తో స్నానం చేయడం అసలు మంచిది కాదు. నీళ్ల తాలూకు ఒత్తిడి జీర్ణవ్యవస్థ మీద బలంగా పడుతుంది.
- భోంచేశాక డాన్స్ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అన్నం తిన్నాక జీర్ణ వ్యవస్థ పనితీరులో తేడాలొస్తాయి. అరుగుదల సరిగా ఉండదు. దాంతో పోషక విలువలు ఒంటపట్టవు.
- అన్నం తిన్నాక కాసేపు అటూ ఇటూ నడవచ్చు. కానీ బ్రిస్క్ వాక్, జాగింగ్, ఎక్కువ సమయం నడవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వికారం కలగొచ్చు. కొందరికి పొట్టలో తిప్పే ప్రమాదమూ ఉంది.
- చల్లటి నీళ్లు తాగొచ్చు. కానీ భోంచేశాక అదీ రాత్రిపూట చల్లటి నీళ్లు అరుగుదల మీద ప్రభావం చూపుతాయి. గోరువెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తాయి.
- భోంచేసిన వెంటనే పడుకోవడమూ మంచిది కాదు. తినడానికీ, పడుకోవడానికీ మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. భోంచేశాక టీ, కాఫీలకూ దూరంగా ఉండాలి. తిన్న వెంటనే వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల పోషకాలు ఒంటపట్టవు.