విశాఖ: అలీ మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని విశాఖలో మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అలీ వారికి ఫోన్లో క్షమాపణలు చెప్పాడు. ఆడియో ఫంక్షన్లలో హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు కమెడియన్ అలీ. అయితే విశాఖకు వెళ్లిన అలీకి చేదు అనుభవం ఎదురైంది. అలీ బస చేస్తున్నహోటల్ ముందు మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మహిళలంటే గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే మర్యాద దక్కదంటూ వారు హెచ్చరించారు. ఇవాళ హీరోయిన్లను అన్నాడు, రేపు రోడ్డు పైన వెళ్లే మహిళల పట్ల కూడా ఈ విధంగానే కామెంట్లు చేయడన్న గ్యారంటీ ఏమిటని మహిళా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట మహిళలను తూలనాడి మాట్లాడితే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో రిలీజ్‌లో హీరోయిన్ సమంత గురించి అలీ కామెంట్ చేశాడు. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదమైంది. మొన్నీ మధ్య జరిగిన సైజ్ జీరో ఆడియో ఫంక్షన్‌లో అనుష్కను ఉద్దేశించి అలీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Popular Posts

 
Top