చిరంజీవి పెద్ద కొడుకును నేనేనంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి తెరతీశాడు. చిరంజీవికి తానే పెద్ద కొడుకునని కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ శుక్రవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో తాను నటించానంటూ చెబుతున్నాడు. ఈ ఘటనపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బోగస్‌ అని, చిరంజీవి ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని కొట్టిపారేశారు. పసివాడి ప్రాణంలో చిరంజీవి కొడుకుగా నటించింది అమ్మాయని వారు వివరణ ఇచ్చారు. 28 ఏళ్ల కిందట సినిమా రాగా..కొడుకునంటూ ఇప్పుడు అతను చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చిరంజీవి అభిమానులు మండిపడ్డారు. సంచలనం చేసి ఏ విధంగానైనా వార్తల్లో నిలవాలన్న కాంక్షతోనే రవీందర్‌ డ్రామా ఆడుతున్నారని మెగా అభిమానులు విమర్శించారు. రవీందర్‌కు మతి భ్రమించిందని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Popular Posts

 
Top