అయితే అందుకు ఎలా మసలుకోవాలో కొందరికే తెలుసు. మహాలక్ష్మి మనల్ని అనుగ్రహించాలంటే ఇలా చెయ్యాలి...
* సూర్యోదయానికి ముందుగానే లేవాలి.
* తొలుత ఇంటి వెనుక వైపు తలుపును తీసిన తర్వాతే సింహద్వారం తెరవాలి.
* మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి.
* ఇంటికొచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వడం, తాగేందుకు నీరు ఇవ్వడం మరిచిపోకూడదు.
* పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మ పాపాలు నశిస్తాయి.
* పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసి సత్య నారాయణ స్వామిని లేదా విష్ణువును, వేంకటేశ్వరుని
* తులసితో అర్చించాలి. ఇది ఉదయపు పూజ కంటే మహా శక్తివంతం. పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో స్వామికి నివేదన చెయ్యాలి.


* వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లభిస్తాయి. వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను చివరికి సంతానానికి కూడా ఇవ్వకూడదని పెద్దల మాట.
* ఇవన్నీ చేసినా కొన్ని మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి, దుర్బుద్ధి విడనాడాలి. అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును అన్యాయంగా గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి ఉండదు.
* ఇంట్లో వెంట్రుకలు పడినా, చెత్త ఉన్నా, వాకిలి అపరిశుభ్రంగా ఉన్నా మహా లక్ష్మి ఆ ఇంటికి రాదు.
* బయటికి వెళ్లి వచ్చాకా కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. గుడినుంచి వస్తే మటుకు ఇందుకు మినహాయింపు. అపుడు నేరుగా పూజా మందిరానికి వెళ్లి దేవునికి నమస్కరించాలి.
* తల్లిదండ్రులను గౌరవించని వాడు, నిరాదరించే వాడు లక్ష్మీ కటాక్షానికి పాత్రుడు కాదు.
* దైవ నింద, రుషి నింద చేసే వాడు, ధర్మాచరణ యందు విముఖుడు, గోళ్లు కొరికేవాడు, లేకి మాటలాడు వాడు, దానం పట్ల అయిష్టత కలిగిన వాడు ఎన్నటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందజాలడు.
శుచి పాటించాలి, పాచి మొహంతో సూర్యుడిని చూడకూడదు.(సూర్యోదయం ముందే నిద్రలేవాలి).
ఇంటిని ఎల్లప్పుడూ శుబ్రంగా ఉంచాలి. సాయంత్రం 5దాటిన తరువాత ఇల్లు తుడవకూడదు. చీకటి పడిన తరువాత తలకి నూనె రాయకూడదు. తుమ్మిన వెంటనే చిరంజీవ చిరంజీవ అనాలి. అన్నం మధ్యలో లేవకుడదు. అన్నాన్ని విసిరేయకూడదు. అన్నం ముందు వడ్డించడానికి కూర్చుని భోజనానికి పిలవకుడదు. మధ్యలో లేచి వెళ్ళకూడదు. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. కేవలం అన్నం మీదే దృష్టి ఉండాలి. మరే విషయం గురించి ఆలోచించకూడదు. శౌచం, అగ్నిహోత్రం(స్నానం చేయకుండా అగ్ని ముట్టకూడదు), తల్లిదండ్రులని గురువుని పూజించాలి. ఆవుని విదిలించకూడదు. గోవు పేడని, మూత్రాన్ని అసహ్యించుకోకూడదు. ఎందుకంటే లక్ష్మి నివాస స్థానం ఆవు పేడలో, మూత్రంలో, గోవు పాదాల దూళిలో, కొమ్ముల రజనులో, లక్ష్మి నివాసం ఉంటుంది. అంతెందుకు గోవులో ముక్కోటి దేవతలు కోలువైవున్నారు. అందువల్ల గోవుని కనీసం అధిలించకండి, విదిలించకండి. ఆధ్యాత్మిక గురువు పాద ధూళిలో లక్ష్మి ఉంటుంది. ఈగురువు ఇంటికివస్తే ఇంట్లోకి తీసుకెళ్ళి పాదాలు కడిగి ఆనీళ్ళు నెత్తిన చల్లుకోండి.
బ్రాహ్మణులను గౌరవించే చోట, సత్యం పలికేచోట, ప్రాణం పోతున్నా ధర్మం కోసం నిలబడే చోట, పతివ్రతా స్త్రీ వద్ద, అతిధిని ఆదరించేచోట(దేవతలు అతిధుల రూపంలో వచ్చి మీ ఆతిధ్యాన్ని స్వీకరిస్తారు. మీరు మనసులో అనుకునే మాటల ప్రభావం కూడా గమనిస్తూనే ఉంటారు. ఈవిషయం చాలామందికి తెలియక ఇంటికి ఎవరైనా వస్తే లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం మురిపెంగా మాట్లాడుతారు. ఇది చాల తప్పు.
ఇదేంటండి ఇవన్ని చేయకపోతే లక్ష్మి ఉండదా? అంటే!
లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు. శాంతి, సౌఖ్యం కూడా.. కొందరికి కోట్లు ఉంటాయి. కాని సుఖం ఉండదు. కొందరికి డబ్బు ఉండదు. కాని చాల సంతోషంగా ఉంటారు. ఇదే లక్ష్మి అంటే..
ఐతే ఇవన్నీ పాటించాలా? అంటే! పాటించాల్సిందే.. దీనికి తిరుగులేదు.. ధర్మశాస్తం అనుసరించితీరాలి. ఇలా కాకుండా నాయిష్టం వచ్చినట్టు చేస్తానంటే! వాళ్ళకి నరకమే గతి. తప్పదు. అనుభవించాల్సిందే. ఎందుకంటే నువ్వు చేసే పాపం తరువాతి తరాలని నాశనం చేస్తుంది.

Popular Posts

 
Top