సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విజయవాడలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. ఉద్యోగులు విజయవాడకు వచ్చేందుకు షరతులు పెడుతున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబుకు మురళీకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడున్నాయో చెబితే వెంటనే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేస్తామని వారు తెలిపారు. జూన్ 2 తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులందరం అమరావతికి వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన ముఖ్యమంత్రికి హామి ఇచ్చారు. ఉద్యోగుల పీఆర్సీ, లోన్, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఎంను ఆయన కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి నట్లు మురళీకృష్ణ తెలిపారు. డీఏ పెండింగ్ కూడా వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారన్నారు. అంతేకాక అమరావతిలో ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని చంద్రాబాబును కోరామని ఆయన అన్నారు. ఇక్కడే 15వేల మంది ఉద్యోగులు ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతాయని సీఎంకు చెప్పామని ఆయన అన్నారు. మేము కోరిన డిమాండ్లన్నిటికి సీఎం చంద్రబాబు ఏకీభవించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.
Popular Posts
-
మేషరాశి: "రామేశ్వరం" : శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామే...
-
కాన్సర్ బి పి ఉన్నవారికి దేవుడిచ్చిన వరం మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మనం ప్రపంచం లోని అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో మన ఇంటి దగ్గర కూడా వ...